పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంజాన్ పండుగ సందర్భంగా ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. కోల్ కత్తాలోని రైన్ డ్రెంచ్డ్ రెడ్ రోడ్ లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ పై తీవ్రస్థాయిలో దీదీ విమర్శల వర్షం కురిపించారు. దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని విభజించు పాలించు అన్న తరహాలో రాజకీయాలు చేస్తూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
దేశంలో మత సామరస్యం అనే విషయంలో దేశానికి పశ్చిమ బెంగాల్ ఆదర్శంగా ఉందని చెప్పుకొచ్చారు. భిన్నత్వంలో ఏకత్వం కనబడేది పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోనేనని అందువల్లే బెంగాల్ అంటే బీజేపీకి పడదని మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రంజాన్ పండుగ నేపథ్యంలో మమతా బెనర్జీ పాల్గొన్న ప్రత్యేక ప్రార్థనలో దాదాపు 14 వేల మంది హాజరయ్యారు. ఈ క్రమంలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. - Mamtha Banerjee Attends Ramzans Eid Festival Prayer $telugu-title:రంజాన్ నేపథ్యంలో ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్న మమతా బెనర్జీ..!!$ *pid:2002844* - Telugu Bhakthi #TeluguBhakthi #Bhakthi #Devotional #TeluguDevotional #Telugu #TeluguStop | Devotional #Devotional #CMMamata #MamataBanerjee #RamzanFestival #Devotional #TeluguStopVideos